News February 3, 2025
ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు సిద్ధం: సోనూసూద్

సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పని చేస్తుందని, AP బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు తాను సిద్ధమని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అటు, సోనూసూద్ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తన ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్సులు ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు.
Similar News
News January 3, 2026
అప్పుడు రూ.1,000.. ఇప్పుడు రూ.22,000

AP: 2 నెలల క్రితం టన్ను అరటి ధర రూ.1,000కి పడిపోవడంతో కన్నీరుపెట్టిన రైతన్న ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఉమ్మడి అనంతపురంలో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మొదటి కోత టన్ను రూ.22 వేలకు చేరింది. ఎగుమతులు పెరగడం, వాతావరణం అనుకూలించడంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సంక్రాంతి వేళ రైతుల మోముల్లో నవ్వులు పూస్తున్నాయి. అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అరటి పెద్దసంఖ్యలో సాగైంది.
News January 3, 2026
14,582పోస్టులు.. టైర్- 2 ఎగ్జామ్స్ తేదీల ప్రకటన

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)-2025 టైర్ 2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News January 3, 2026
BJPని చూసి RSSను అర్థం చేసుకోవద్దు: మోహన్ భాగవత్

‘‘RSS యూనిఫాం, వ్యాయామాలను చూసి పారా మిలిటరీ అనుకోవద్దు. అలాగే BJPని చూసి సంఘ్ను అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు’’ అని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజాన్ని ఏకం చేసి, విదేశీ శక్తుల చేతుల్లో భారత్ మళ్లీ చిక్కకుండా చూడటమే సంఘ్ లక్ష్యమని భోపాల్ (MP)లో మాట్లాడుతూ చెప్పారు. వికీపీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, అసలు విషయం తెలుసుకోవడానికి నేరుగా ‘శాఖ’కు వచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు.


