News March 18, 2024
మహిళల రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం: PM

శక్తి (అధికారం) పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. భారతదేశం మొత్తం శక్తిని ఆరాధిస్తుంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుంది. నేను భారతమాత పూజారిని. శక్తిస్వరూపులైన మహిళల రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News November 28, 2025
BREAKING.. ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని ఓ రైతు నుంచి తహశీల్దార్ మహేందర్ రూ.15,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.


