News October 15, 2025
రూ.1కే రీఛార్జ్.. 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

దీపావళి సందర్భంగా కొత్త యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘BSNL దీపావళి బొనాంజా’ ఆఫర్ నేటి నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని Xలో వెల్లడించింది.
Similar News
News October 15, 2025
నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CBN

AP: పథకాల అమలుపై నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని CM CBN వెల్లడించారు. ‘సుపరిపాలన అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, GST సంస్కరణల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులు థియేటర్లలో స్లైడ్స్ ప్రదర్శించాలి. టెక్నాలజీ డేటాను ఆడిట్ చేసి ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటా. అధికారులిచ్చే సమాచారానికి వాస్తవాలకు పొంతన ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీల కుట్రలను టెక్నాలజీతో బయట పెట్టామన్నారు.
News October 15, 2025
గూగుల్ డేటా సెంటర్కు పోల’వరం’!

విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్కు భారీ స్థాయిలో నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1 టీఎంసీ జలాలు అవసరం అవుతాయని అంటున్నారు. అయితే పోలవరం లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా విశాఖకు ఏడాదికి 23.44 TMCల నీరు సరఫరా కానుంది. ఆ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి కానుంది. దీనివల్ల నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్.. డేటా సెంటర్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.
News October 15, 2025
ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

సంజూ శాంసన్ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.