News July 25, 2024

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంపు?

image

టెలికాం నెట్‌వర్క్‌లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA)లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15% నుంచి 20%కి పెంచింది. PCBAలలో దాదాపు 80% విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా టెలికాం ఆపరేటర్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడంతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశం ఉంది. 5G విస్తరణ వేగం కూడా మందగించొచ్చు. వైఫై రౌటర్ల ధరలు కూడా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News December 4, 2025

ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

image

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.

News December 4, 2025

జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

image

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.

News December 4, 2025

డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

image

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం