News April 24, 2024

RECORD: 1,400 మందికి 590 మార్కులు

image

AP: ఈ ఏడాది పదో తరగతి విద్యార్థుల్లో చాలా మందికి టాప్ మార్కులు వచ్చాయి. దాదాపు 1,400 మందికి 590, ఆ పైన మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇంత మందికి 590 మార్కులు రాలేదు. 18,000 మంది 570+ మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో 104 మందికి 590 పైగా మార్కులు వచ్చాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి 597 మార్కులు వచ్చాయి.

Similar News

News September 16, 2025

KNR: శాతవాహన డిగ్రీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రేపే

image

డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థుల కోసం ఇన్స్టంట్ పరీక్ష SEP 17న (రేపు) ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. 5వ సెమిస్టర్ ఎగ్జామ్ ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో జరుగుతాయని, 6వ సెమిస్టర్ ఎగ్జామ్ మ.2 గం.ల నుంచి సా.5 గం.ల వరకు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరుగుతాయని చెప్పారు.

News September 16, 2025

BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

News September 16, 2025

కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.