News November 23, 2024

పెర్త్ టెస్టుకు రికార్డ్ బ్రేకింగ్ అటెండెన్స్

image

పెర్త్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న BGT తొలి టెస్టుకు తొలి రోజు 31,302 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఒక్క రోజులో ఇంత మంది అక్కడ మ్యాచ్‌ను చూడటం ఇదే తొలిసారి. దీంతో పెర్త్‌లో సింగిల్ డేలో అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. నేడు, రేపు మ్యాచ్ మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈ టెస్టులోనే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News December 26, 2025

చెర్రీ-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి?

image

కాంతార ఛాప్టర్-1లో మెరిసిన రుక్మిణి వసంత్ త్వరలో పట్టాలెక్కనున్న చెర్రీ-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా చేయనున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సమ్మర్‌లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్సుంది. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’లో నటిస్తుండగా, తారక్-నీల్ సినిమాలో రుక్మిణి వర్క్ చేస్తున్నారు. కాగా తెలుగులో చరణ్, తారక్ నటన అంటే తనకు ఇష్టమని ఓ ఈవెంట్లో రుక్మిణి చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.

News December 26, 2025

నేడు 3వ T20.. భారత్ సిరీస్ పట్టేస్తుందా?

image

ఉమెన్స్: 5 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య ఇవాళ 3వ T20 తిరువనంతపురంలో జరగనుంది. తొలి రెండో T20ల్లో టీమ్ఇండియా ఘన విజయాలు సాధించింది. అదే ఫామ్‌ కంటిన్యూ చేస్తూ ఇవాళ్టి మ్యాచులోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు శ్రీలంక సైతం సిరీస్‌లో తొలి విజయం కోసం నిన్న నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. 7pmకు JioHotstar, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ స్ట్రీమింగ్ కానుంది.

News December 26, 2025

ధనుర్మాసం: పదకొండో రోజు కీర్తన

image

‘గొప్ప వంశంలో పుట్టిన చిన్నదానా! వేలకొద్దీ పశుసంపద గల బంగారు తీగవంటిదానా! నీ స్నేహితులమంతా నీ ఇంటి వాకిట చేరి శ్రీకృష్ణుని నామాలను గొంతెత్తి పాడుతున్నాము. ఇంత సందడి జరుగుతున్నా, నీవు మాత్రం ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నావు. కృష్ణునితో కలిసుండే ఆత్మానందాన్ని నీవు ఒక్కదానివే అనుభవించడం సరికాదు. అందరితో కలిసి ఆ స్వామిని సేవించడానికి త్వరగా బయటకు రా. మనమంతా కలిసి ఈ వ్రతాన్ని పూర్తి చేద్దాం, రా!’