News November 23, 2024

పెర్త్ టెస్టుకు రికార్డ్ బ్రేకింగ్ అటెండెన్స్

image

పెర్త్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న BGT తొలి టెస్టుకు తొలి రోజు 31,302 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఒక్క రోజులో ఇంత మంది అక్కడ మ్యాచ్‌ను చూడటం ఇదే తొలిసారి. దీంతో పెర్త్‌లో సింగిల్ డేలో అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. నేడు, రేపు మ్యాచ్ మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈ టెస్టులోనే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News January 13, 2026

తొలిసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ!

image

TG: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఈనెల 18న మేడారం జాతర ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, రైతు భరోసా పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి రానున్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం.

News January 13, 2026

ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

image

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>

News January 13, 2026

SBI ఖాతాదారులకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.