News September 5, 2024

Record: 9 దేశాల జనాభాను దాటేసిన డీమ్యాట్లు

image

దేశంలో డీమ్యాట్ల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారిగా 17.11 కోట్లు దాటేసింది. ఆగస్టులో కొత్తగా 42.3 లక్షల ఖాతాలు తెరవడంతో ఇది సాధ్యమైంది. భారత్‌లోని మొత్తం డీమ్యాట్ల సంఖ్య బంగ్లాదేశ్ జనాభాకు దాదాపు సమానం. రష్యా, ఇథియోపియా, మెక్సికో, జపాన్ సహా 9 దేశాల జనాభా కన్నా ఎక్కువ. సరళమైన e-KYC రూల్స్, బుల్‌రన్, స్టాక్ మార్కెట్లపై పెరిగిన అవగాహన, రిటైల్ పార్టిసిపేషన్, పెట్టుబడికి భద్రత ఇందుకు కారణాలు.

Similar News

News October 16, 2025

నక్సలిజంపై పోరులో ల్యాండ్‌మార్క్ డే: అమిత్‌షా

image

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, నక్సలిజంపై పోరులో ల్యాండ్‌మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్‌మఢ్, నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి. 2024 JAN నుంచి 2,100 మంది నక్సలైట్లు సరెండరయ్యారు. 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 MAR 31లోపు నక్సలిజం అంతరిస్తుందనడానికి ఈ నంబర్లు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

News October 16, 2025

50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…

image

TG: సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించరాదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికలు జరపాలనుకుంటే ఆ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లుండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50%లోనే సీట్లు కేటాయించాలి. ప్రస్తుతమున్న12769 పంచాయతీల్లో 6384, MPTC 5745లో 2872, MPP 566లో 283, ZPP 32లో 16 రిజర్వేషన్ల కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లలోనే SC, ST, BCలకు సీట్లు రిజర్వు చేయాలి. దీనికి మించి ఉండాలంటే పార్టీ పరంగా ఇవ్వాలి.

News October 16, 2025

రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: మోదీ

image

AP: డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కాదని, ఇప్పుడు ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా ఉందని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని కర్నూలు సభలో పేర్కొన్నారు.