News September 5, 2024
Record: 9 దేశాల జనాభాను దాటేసిన డీమ్యాట్లు

దేశంలో డీమ్యాట్ల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారిగా 17.11 కోట్లు దాటేసింది. ఆగస్టులో కొత్తగా 42.3 లక్షల ఖాతాలు తెరవడంతో ఇది సాధ్యమైంది. భారత్లోని మొత్తం డీమ్యాట్ల సంఖ్య బంగ్లాదేశ్ జనాభాకు దాదాపు సమానం. రష్యా, ఇథియోపియా, మెక్సికో, జపాన్ సహా 9 దేశాల జనాభా కన్నా ఎక్కువ. సరళమైన e-KYC రూల్స్, బుల్రన్, స్టాక్ మార్కెట్లపై పెరిగిన అవగాహన, రిటైల్ పార్టిసిపేషన్, పెట్టుబడికి భద్రత ఇందుకు కారణాలు.
Similar News
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.
News September 15, 2025
పాక్పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

ఆసియా కప్లో పాకిస్థాన్ను ఓడించి హోటల్కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్డే కావడంతో స్పెషల్ కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్స్టా అకౌంట్లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.
News September 15, 2025
సీఎం రేవంత్ వద్దకు ఫీజు రీయింబర్స్మెంట్ పంచాయతీ!

TG: ప్రైవేట్ కాలేజీల బంద్ పంచాయితీ సీఎం రేవంత్ వద్దకు చేరింది. ఈ విషయమై సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. నిన్నటి సమావేశ సారాంశం, కాలేజీ యాజమాన్యాల డిమాండ్లను మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం. దీంతో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేసే ఆస్కారముందని కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి.