News September 5, 2024

Record: 9 దేశాల జనాభాను దాటేసిన డీమ్యాట్లు

image

దేశంలో డీమ్యాట్ల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారిగా 17.11 కోట్లు దాటేసింది. ఆగస్టులో కొత్తగా 42.3 లక్షల ఖాతాలు తెరవడంతో ఇది సాధ్యమైంది. భారత్‌లోని మొత్తం డీమ్యాట్ల సంఖ్య బంగ్లాదేశ్ జనాభాకు దాదాపు సమానం. రష్యా, ఇథియోపియా, మెక్సికో, జపాన్ సహా 9 దేశాల జనాభా కన్నా ఎక్కువ. సరళమైన e-KYC రూల్స్, బుల్‌రన్, స్టాక్ మార్కెట్లపై పెరిగిన అవగాహన, రిటైల్ పార్టిసిపేషన్, పెట్టుబడికి భద్రత ఇందుకు కారణాలు.

Similar News

News November 9, 2025

డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

image

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News November 9, 2025

బాడీ షేమింగ్.. హీరోయిన్‌కు క్షమాపణలు

image

బాడీ షేమింగ్‌కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్‌కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.

News November 9, 2025

తెలంగాణ రైతులకు బిహార్ ఎన్నికల దెబ్బ!

image

బిహార్‌ ఎన్నికలు రైతులకు సమస్యను తెచ్చి పెట్టాయి. ఓటేసేందుకు బిహారీలు సొంత రాష్ట్రానికి వెళ్తుండటంతో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ కావడం లేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో 20వేల మంది హమాలీలు ఉంటే 18వేల మంది బిహారీలే. ఓటేసేందుకు రాజకీయ పార్టీలు వారికి రూ.5వేల చొప్పున ఇచ్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న అక్కడ ఎన్నికలు ముగుస్తాయి.