News July 18, 2024
RECORD: టెస్టుల్లో ఫాస్టెస్ట్ 50

WIతో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 4.2 ఓవర్లలోనే టీమ్ స్కోర్ 50 దాటింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లు డకెట్ (29 బంతుల్లో 48*), పోప్ (16*) క్రీజులో ఉన్నారు. కాగా ఇంగ్లండ్ 1994లో సౌతాఫ్రికాపై 4.3ఓవర్లలో, 2002లో శ్రీలంకపై 4.6ఓవర్లలో ఈ ఫీట్ సాధించింది.
Similar News
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.
News December 25, 2025
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

TG: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29న 10.30amకు మొదలవుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిరోజులు సమావేశాలు జరగాలనేది BAC భేటీలో నిర్ణయించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరిగే ఆస్కారముంది. అలాగే MPTC, ZPTC ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
News December 25, 2025
తగ్గేదేలే.. లీడర్స్ ON FIRE

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నాయకులు ఫైర్ మీదున్నారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంలో ఎవరూ తగ్గడం లేదు. AP సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ YCP నేతలకు <<18625628>>వార్నింగ్స్<<>> ఇస్తుండగా, జగన్ సైతం బయటకు వచ్చినప్పుడల్లా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఫైరవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ సీఎం రేవంత్, BRS చీఫ్ కేసీఆర్, KTR, హరీశ్ రావు <<18660564>>విమర్శలతో<<>> రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.


