News March 21, 2024
రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,090 పెరిగి రూ.67,420కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.1,000 పెరిగి రూ.61,800కి చేరింది. అటు కేజీ వెండి రూ.1,500 పెరిగి రూ.81,500 పలుకుతోంది. ఈ ఒక్క నెలలోనే గోల్డ్ రేట్లు 5% మేర పెరిగాయి. ఈ ఏడాది కీలక వడ్డీ రేట్లలో కనీసం 3 సార్లు తగ్గింపు ఉంటుందన్న అమెరికా ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ ప్రకటనతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.
Similar News
News July 10, 2025
విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ను ఆదేశించారు.
News July 10, 2025
చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్పై తొలి టీ20 సిరీస్ కైవసం

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్ ఉమెన్పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.
News July 10, 2025
అనుపమ చిత్రంపై వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

అనుపమ, సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే జానకిvs స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీకి సెన్సార్ బోర్డు హీరోయిన్ పేరు మార్పు సహా 96 కట్స్ చెప్పింది. దీనిపై నిర్మాతలు కోర్టుకెళ్లగా సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండే మార్పులు చెప్పింది. మూవీ పేరును వి.జానకిvs స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టు సీన్లో ఒకచోట హీరోయిన్ పేరు మ్యూట్ చేయాలంది. మూవీ టీమ్ అభిప్రాయం తెలియజేయాలని కోర్టు కోరింది.