News July 2, 2024

పెన్షన్ల పంపిణీలో రికార్డు: మంత్రి పార్థసారథి

image

APలో 65.18 లక్షల మంది లబ్ధిదారుల్లో 61.76 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక రికార్డు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్కరోజులో 85% మాత్రమే పంచేవారు. ఇప్పుడు 12 గంటల్లోనే ఈ రికార్డు సాధించాం. సమర్థ నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ఉద్యోగులు ఎంత స్ఫూర్తిగా పనిచేస్తారనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 28, 2025

దత్తత గ్రామంలో నిర్మలమ్మ పర్యటన

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ APలో పర్యటించారు. తాను దత్తత తీసుకున్న ప.గో. జిల్లా పెదమైనవానిలంక గ్రామస్థులతో మమేకమయ్యారు. స్థానిక పాఠశాలలో రూ.18లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఏడాదిలో 146 PM ఆవాస్ యోజన ఇళ్లను పూర్తిచేయాలని, 200మంది మత్స్యకారులకు బోట్లు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తనవంతుగా ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

News December 28, 2025

అమ్మతనానికే కళంకం.. ఇదేనా కన్న ప్రేమ?

image

కొందరు మహిళలు అమ్మతనానికే కాదు.. స్త్రీ జాతికే కళంకం తెస్తున్నారు. యూపీకి చెందిన సంగీత అనే వివాహిత వేరే యువకుడితో అఫైర్ పెట్టుకుని ఐదుగురు పిల్లలను గాలికొదిలేసి ప్రియుడితో పరారైంది. మరోవైపు TG నిజామాబాద్‌లో ఓ తల్లి నవమాసాలు మోసి, కని.. ముక్కు పచ్చలారకుండానే ఆ పసికందును గోదాట్లో కలిపేసింది. కన్నతీపి, పేగుబంధం అనే పదాలకు అర్థం తెలిసిన వాళ్లెవరూ ఇలా చేయరేమో? వీళ్లు అమ్మతనాన్నే అవమానించారు.

News December 28, 2025

Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో రామ్‌ చరణ్, ధోనీ, సల్మాన్

image

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, క్రికెట్ లెజెండ్ MS ధోనీ, నటుడు బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో SMలో వైరల్‌ అవుతోంది. నిన్న సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు చరణ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ అరుదైన ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఈ ముగ్గురి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు వీరు కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.