News August 31, 2024
ఏపీలో రికార్డు స్థాయి వర్షపాతం

AP: రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి. వీరులపాడులో అత్యధికంగా 21CM, కంచికచర్ల 20.3CM, ఇబ్రహీంపట్నంలో 15.3CM, నందిగామలో 13.8CM, విజయవాడలో 13.5CM, గంపలగూడెంలో 13.1CM, చందర్లపాడులో 11CM, జగ్గయ్యపేట, విసన్నపేటలో 8.3CM వర్షపాతం కురిసింది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 8, 2025
రైల్వేలో 8,868 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

RRBలో 8,868 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 33ఏళ్లవారు ఈనెల 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 30ఏళ్లున్న వారు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 8, 2025
APSRTCలో 277 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

APSRTCలో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కర్నూలు(46), నంద్యాల(43), అనంతపురం(50), శ్రీ సత్యసాయి(34), కడప(60), అన్నమయ్య(44) జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకున్న తర్వాత వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: apsrtc.ap.gov.in/
News November 8, 2025
ఆవులు, గొర్రెల మందలను పొలాల్లో ఉంచితే లాభమేంటి?

కొందరు రైతులు పంట కోత తర్వాత లేదా మరో పంట నాటే ముందు గొర్రెలు, ఆవుల మందలను పంట పొలాల్లో కట్టడం, ఉంచడం చూస్తుంటాం. దీని వల్ల లాభాలున్నాయ్. ఆ పశువుల మూత్రం, పేడ, గొర్రెల విసర్జితాల వల్ల భూమిలో, పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. భూమికి క్షారత్వం తగ్గి.. సారం పెరుగుతుంది. ఫలితంగా పంట నాణ్యత, దిగుబడులు పెరుగుతాయి. తర్వాతి పంటకు ఎరువులపై పెట్టే ఖర్చు 30 నుంచి 40 శాతం తగ్గించుకోవచ్చు.


