News May 13, 2024
రికార్డు సృష్టించిన RCB

IPL-2024లో వరుసగా 5 మ్యాచులు గెలిచిన జట్టుగా RCB రికార్డు సృష్టించింది. నిన్న ఢిల్లీపై 47 రన్స్ తేడాతో గెలవడంతో ఈ ఘనతను సాధించింది. తొలి 8 మ్యాచుల్లో ఒకటే విజయం సాధించిన బెంగళూరు, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లోనూ గెలుపొందింది. GT(2 సార్లు), SRH, PBKS, DC జట్లను చిత్తుచేసింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈనెల 18న చెన్నైతో కీలక పోరులో తలపడనుంది.
Similar News
News February 9, 2026
జెమినీ, చాట్GPTకి దీటుగా మన ‘సర్వం ఏఐ’!

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
News February 9, 2026
సర్వం ఏఐ.. ఇంతకీ ఏంటిది?

సర్వం ఏఐ కంపెనీని 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. హైఎండ్ క్లౌడ్ కంప్యూటర్ల కోసమే కాకుండా ఫోన్లు, స్థానిక భాషల కోసం దీన్ని రూపొందించారు. భారత భాషల్లోని క్లిష్టమైన డాక్యుమెంట్లనూ Sarvam Vision ఈజీగా చదివేస్తోంది. text-to-speech టూల్ ‘Bulbul’ 11 భారత భాషల్లో 32 వాయిస్లు అందిస్తోంది. చౌకగా, స్థానిక భాషలతో, స్క్రిప్టులను చదవడంలో మేలైన OCRతో ఇక్కడి సంస్థలను సర్వం ఏఐ ఆకర్షిస్తోంది.
News February 9, 2026
రూ.20కే గోధుమ పిండి.. పంపిణీ షురూ

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.


