News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 19, 2026
మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?
News February 19, 2026
ఆత్మ గౌరవం కోసం కొన్ని మార్గదర్శకాలు

☛ నిన్ను దూరం పెట్టే వారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు.
☛నీ నిజాయితీని గుర్తించని చోట నీ విలువైన కాలాన్ని వృథా చేయకు.
☛ ఆత్మాభిమానాన్ని మించిన సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదని తెలుసుకో.
☛ మనస్ఫూర్తిగా పిలవని చోటుకి, అది ఎంత పెద్ద ఇల్లైనా వెళ్ళకు.
☛ నీది కాని దాని మీద, నిన్ను దహించేంత అతిగా ప్రేమను పెంచుకోకు.
News February 19, 2026
కాంగ్రెస్ బడ్జెట్ కూతురికి జన్మనివ్వడం లాంటిది: రాజస్థాన్ BJP ఎమ్మెల్యే

రాష్ట్ర బడ్జెట్ను కొడుకు, కూతురితో పోలుస్తూ రాజస్థాన్ BJP MLA బహదూర్ సింగ్ కోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘BJP ప్రభుత్వం 3 బడ్జెట్లలో కొడుకులకు జన్మనిచ్చింది. కానీ గత కాంగ్రెస్ బడ్జెట్ మాత్రం కూతురికి జన్మనివ్వడం లాంటిది. మాది యువకులకు ఉద్దేశించినది. కానీ కాంగ్రెస్ది వృద్ధాప్యానికి సంబంధించినది. కొడుకు అంటే ఉపయోగకరం. కాంగ్రెస్కు కొడుకు పుట్టలేదు. అందుకే ప్రతిపక్షంలో ఉంది’ అని సభలో అన్నారు.


