News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 16, 2026
‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ సహా ఇతర సేవలు అందనున్నాయి. హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడంతో పాటు రూ.2.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగిస్తుండగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ఇందులో గేట్స్ ఫాండేషన్తో TCS భాగస్వాములు.
News February 16, 2026
రసవత్తరంగా కరీంనగర్, NZB మేయర్ ఎన్నిక!

TG: కాసేపట్లో మేయర్ ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎక్స్అఫీషియోతో కలిపి 69(66+3) ఓట్లున్నాయి. ఓటింగ్కు దూరంగా ఉండాలని BRS నిర్ణయించడంతో ఓట్ల సంఖ్య 60కి, మ్యాజిక్ ఫిగర్ 31కి మారింది. MP బండి సంజయ్తో కలిపి 34 ఓట్లున్న BJPకే మేయర్ పీఠం దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. అటు NZBలో BJP 28, CONG 17, MIM 14, BRS 1 సీట్లున్నాయి. CONG-MIM కలిసి మేయర్ పీఠం దక్కించుకోవచ్చు.
News February 16, 2026
బిల్గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్

AP: విజయవాడలో ల్యాండ్ అయ్యేందుకు బిల్గేట్స్ విమానానికి ATC క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో గన్నవరం ఎయిర్పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండైంది. మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు బిల్గేట్స్కు స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన రోడ్డు మార్గంలో వెలగపూడిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. విజిబిలిటీ లేక అరగంటపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టగా టెన్షన్ వాతావరణం నెలకొంది.


