News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News January 14, 2026
ర్యాంకింగ్స్లో నంబర్-1 ప్లేస్లో ఇండియా

ICC లేటెస్ట్ ర్యాంకింగ్స్లో IND అదరగొట్టింది. వన్డేల్లో 122 పాయింట్లతో తొలి ప్లేస్లో నిలిచింది. T20ల్లో 272 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. వన్డే బ్యాటింగ్లో కోహ్లీ, T20ల్లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో టెస్టుల్లో జడేజా మొదటి స్థానంలో ఉన్నారు.
News January 14, 2026
‘10 మినిట్స్ డెలివరీ’పై జెప్టో, స్విగ్గీ వెనక్కి

కేంద్రం <<18845524>>ఆదేశాలతో<<>> 10 మినిట్స్ డెలివరీ క్లెయిమ్ను స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో నిలిపివేశాయి. నిన్న బ్లింకిట్ ఈ ప్రకటన చేయగా తాజాగా ఈ రెండు సంస్థలూ 10 మినిట్స్ క్లెయిమ్ను ఆపివేస్తున్నట్లు తెలిపాయి. తమ వెబ్సైట్లు, యాప్ల నుంచి ‘10 మినిట్స్ డెలివరీ’ అనే ప్రకటనలను తొలగించాయి. కాగా గిగ్ వర్కర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ హామీని ఇవ్వొద్దని కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయా డెలివరీ సంస్థలకు సూచించారు.
News January 14, 2026
ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.


