News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 6, 2026
కిచెన్లో వాడే సిలికాన్ మూతలు సేఫేనా?

కిచెన్లో ఈ మధ్య సిలికాన్ మూతలు కామన్గా కనిపిస్తున్నాయి. వాడడానికి, క్లీన్ చేయడానికి ఈజీగా ఉండడమే దీనికి కారణం. అయితే ఇవి సేఫేనా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతోంది. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం.. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ సిలికాన్తో తయారు చేసిన మూతలు సురక్షితమే. అయితే వాటిని నార్మల్ కిచెన్ టెంపరేచర్ దగ్గర మాత్రమే వాడాలి. లేదంటే ప్లాస్టిక్ తరహాలోనే ఆరోగ్యానికి ముప్పు తలపెడతాయి.
News February 6, 2026
ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!
News February 6, 2026
బెంగాల్ ఎన్నికలు.. ఒంటరిగా బరిలోకి కాంగ్రెస్..!

వె.బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో 2 దశాబ్దాలుగా ఉన్న పొత్తు తెంచుకుని 2006 తర్వాత తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగనుంది. 294 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తుల కారణంగానే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం లేదని హైకమాండ్కు తెలిపారు.


