News June 13, 2024

రికార్డు సృష్టించిన వెస్టిండీస్

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

Similar News

News February 19, 2026

విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

image

UP కాన్పూర్‌లో జరిగిన అండర్-13 మ్యాచులో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరిగే సమయంలో తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో అంపైర్ మాణిక్ గుప్తా (65) ప్రాణాలు కోల్పోయారు. ముఖం, శరీరం చుట్టూ పెద్దసంఖ్యలో తేనెటీగలు కుట్టడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించారని అధికారులు వెల్లడించారు. మరో ఫీల్డ్ అంపైర్, 15-20 మంది ఆటగాళ్లు సైతం గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

News February 19, 2026

డీల్ చేసుకోండి.. లేదంటే దాడి తప్పదు: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా భారీగా సైనిక బలగాలను <<19181534>>మోహరిస్తున్న<<>> వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో అర్థవంతమైన డీల్ చేసుకోవాలని, లేదంటే దాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘ఇరాన్‌తో డీల్ సులభం కాదని తేలిపోయింది. డీల్ జరగకపోతే పర్యవసానాలు తప్పవు. మరో 10 రోజుల్లోనే దాన్ని తెలుసుకుంటారు’ అని వార్నింగ్ ఇచ్చారు.

News February 19, 2026

383 ప్రభుత్వ కంపెనీలు.. అలా పడున్నాయి అంతే!

image

ఆదాయం లేదు.. పని లేదు, ఉన్నా అంతంతమాత్రమే. అయినా ఎప్పటికప్పుడు ఆడిట్స్ జరుగుతూ అధికారిక లెక్కల్లో ఉంటున్నాయి. దేశంలోని 383 ప్రభుత్వ రంగ సంస్థల దుస్థితి ఇది. ఈ కంపెనీలను మూసివేయాలన్నా సుదీర్ఘ లీగల్ ప్రొసీజర్, కొన్ని సంస్థలు కోర్టు కేసుల్లో ఉండటం, అసెట్‌లా వాడుకునేందుకు, రాజకీయ కారణాలతో సాధ్యం కావట్లేదు. దీంతో ట్యాక్స్ పేయర్స్‌పైన భారం పడుతోంది. అత్యధికంగా బిహార్‌లో 39 ఇనాక్టివ్ కంపెనీలు ఉన్నాయి.