News June 13, 2024
రికార్డు సృష్టించిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 4, 2026
గడాఫీ కుమారుడి హత్య

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
News February 4, 2026
వరిలో ఈ తెగుళ్లు కనిపిస్తున్నాయా? నివారణ ఎలా?

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి ఎక్కువైంది. ప్రధానంగా వరిలో మానిపండు తెగులు, పాముపొడ(మాగుడు) తెగులు, రెల్లరాల్చు పురుగు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 4, 2026
CSK అభిమానులకు గుడ్న్యూస్

IPLలో అత్యంత విజయవంతమైన CSK ఫ్రాంచైజీ త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ CEO కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఇది భవిష్యత్తు ప్రణాళికలో భాగమని, మహిళల క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత WPL 2026 సీజన్ ముగింపు దశకు వచ్చింది. రేపు వడోదరలో జరిగే ఫైనల్లో ఢిల్లీ టీమ్ RCBతో తలపడనుంది. ప్రస్తుతం WPLలో 5 జట్లు పాల్గొంటున్నాయి.


