News June 13, 2024

రికార్డు సృష్టించిన వెస్టిండీస్

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో వెస్టిండీస్ కొత్త రికార్డు సృష్టించింది. 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో ఆ జట్టు 30 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 149/9 స్కోర్ చేసింది. ఈ మ్యాచులో విండీస్ 13 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

Similar News

News January 26, 2026

నాంపల్లి: రోజుకు 44వేల మంది సందడి చేస్తున్నారు

image

నుమాయిష్.. నగరవాసులు సరదాగా గడిపే ప్రాంతం. ఏటా JAN, FEB నెలల్లో నాంపల్లిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఈ సంవత్సరం లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు (25వ తేదీ వరకు) 11లక్షల మంది నుమాయిష్‌లో సందడి చేశారు. అంటే రోజుకు సరాసరి 44వేల మంది వస్తున్నట్లు. FEB 15 వరకు నగరవాసులకు ఈ వినోదం అందుబుటోల ఉంటుంది. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

News January 26, 2026

హిందీ అనేక మాతృభాషలను మింగేసింది: ఉదయనిధి

image

తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదని Dy.CM ఉదయనిధి స్పష్టం చేశారు. 1960sలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాదిలో హిందీని ప్రవేశపెట్టడం వల్ల హర్యాన్వీ, భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు కనుమరుగయ్యాయి. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ నాశనం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.

News January 26, 2026

రంజీ ట్రోఫీ.. 568 రన్స్ తేడాతో బిహార్ ఘన విజయం

image

రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్‌లో మణిపుర్‌పై బిహార్ 568 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఇదే బిగ్గెస్ట్ విన్. బిహార్ ఆటగాళ్లు పీయూష్ సింగ్ 216*, బిపిన్ 143, సకిబుల్ గని 108 పరుగులతో చెలరేగారు. కాగా ఈ విజయంతో వచ్చే సీజన్‌లో ఎలైట్ గ్రూపునకు బిహార్ అర్హత సాధించింది. రంజీ ట్రోఫీలో జట్లను వాటి ప్రదర్శనల ఆధారంగా ఎలైట్(అగ్రశ్రేణి), ప్లేట్(దిగువ శ్రేణి) గ్రూపులుగా విభజిస్తారు.