News July 18, 2024
నష్టాల నుంచి కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 81,343 (+626) వద్ద స్థిరపడింది. మరోవైపు ఆల్ టైమ్ హై (24,837) తాకిన నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 24,800 వద్ద ముగిసింది. LTIM 3.48%, ONGC 2.99% సహా TCS, విప్రో 2 శాతానికిపైగా లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఓ దశలో నష్టాలను నమోదు చేసిన మార్కెట్లు లాభాలతో క్లోజవడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


