News September 21, 2025
రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం

AP: రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, అనకాపల్లి, పల్నాడు (వినుకొండ) జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Similar News
News September 21, 2025
పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 190 పోస్టులు

<
News September 21, 2025
మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.
News September 21, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 70 పోస్టులు

<