News September 21, 2025

రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షం

image

AP: రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, అనకాపల్లి, పల్నాడు (వినుకొండ) జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Similar News

News September 21, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులు

image

<>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌ 190 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు OCT 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్), CA/CMA, CFMA/MBA(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 21, 2025

మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

image

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్‌తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.

News September 21, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 70 పోస్టులు

image

<>భారత్ <<>>ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 70 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్/ME/MTech, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు SEP 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్‌కు గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు, ప్రాజెక్టు ఇంజినీర్‌కు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.