News April 5, 2024
రెడ్ బుక్ అంటే వైసీపీకి వణుకు: లోకేశ్

AP: రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీలోని ప్రతి ఒక్కరికీ వణుకు పుడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ‘టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి తీరుతాం. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీని ఎవరూ విశ్వసించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇవాళ విజయవాడలో లోకేశ్ సమక్షంలో అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు.
Similar News
News January 3, 2026
ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: భట్టి విక్రమార్క

TG: కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే MPDO, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
News January 3, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో పోస్టులు

<
News January 3, 2026
ప్రాణం తీసిన క్యాబేజీ టేప్వార్మ్.. వండకముందు ఇలా చేయకపోతే డేంజరే!

క్యాబేజీలో ఉండే Tapeworm(బద్దెపురుగు) ప్రాణాంతకంగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఒక విద్యార్థిని వీటివల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్కు గురై మరణించారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, వంకాయ వంటి కూరగాయలను సరిగ్గా కడగకుండా తింటే ఈ పురుగుల గుడ్లు రక్తంలో కలిసి మెదడుకు చేరతాయి. దీనివల్ల ఫిట్స్, తీవ్రమైన తలనొప్పి వస్తాయి. కూరగాయలను బాగా కడిగి పూర్తిగా ఉడికించి తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


