News January 14, 2025

ఇంగ్లండ్ సిరీసుకు టీమ్ సైజ్ తగ్గించండి: గవాస్కర్

image

ఇంగ్లండ్ టెస్టు సిరీసుకు టీమ్ సైజును తగ్గించాలని టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. 16 కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేయడం సెలక్టర్ల అపనమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఆసీస్‌కు 19 మందిని పంపించడం తెలిసిందే. ఎక్కువ మందిని పంపే స్తోమత BCCIకి ఉన్నా టీమ్ఇండియా క్యాప్‌ ఈజీగా ఇచ్చేయొచ్చని కాదన్నారు. విదేశాల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఎక్కువ ఆడాలని, ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ తీసేయాలని చెప్పారు.

Similar News

News December 24, 2025

పాస్టర్లకు రూ.50 కోట్లు విడుదల.. నేడు అకౌంట్లలోకి!

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో పెండింగ్ బకాయిలు రిలీజ్ చేసి 24వ తేదీలోపు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.

News December 24, 2025

దీపం ఇలా పెట్టాలి: పండితులు

image

దీపారాధనలో ముందుగా నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడి, మట్టి కుందులను కడిగిన తర్వాతే వాడాలి. స్టీలు కుందులను వాడకూడదు. కుందులను నేరుగా కింద పెట్టకుండా పళ్లెం/తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదు. ఏక హారతిలో కర్పూరం లేదా అడ్డవత్తిని వెలిగించి, దాని సహాయంతోనే దీపారాధన చేయాలి. దీపం నుంచి అగరవత్తులను, ఇతర హారతులను ఎప్పుడూ వెలిగించకూడదని శాస్త్ర వచనం.

News December 24, 2025

వాళ్లకు పెన్షన్లు కట్!

image

TG: పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఆడిట్‌లో బయటపడింది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 20వేల శాంపిల్స్ సేకరిస్తే అందులో 2వేల మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు ఇలా అక్రమంగా చేయూత పొందుతున్నట్లు గుర్తించారు. వీళ్లందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.