News January 14, 2025

ఇంగ్లండ్ సిరీసుకు టీమ్ సైజ్ తగ్గించండి: గవాస్కర్

image

ఇంగ్లండ్ టెస్టు సిరీసుకు టీమ్ సైజును తగ్గించాలని టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. 16 కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేయడం సెలక్టర్ల అపనమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఆసీస్‌కు 19 మందిని పంపించడం తెలిసిందే. ఎక్కువ మందిని పంపే స్తోమత BCCIకి ఉన్నా టీమ్ఇండియా క్యాప్‌ ఈజీగా ఇచ్చేయొచ్చని కాదన్నారు. విదేశాల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఎక్కువ ఆడాలని, ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ తీసేయాలని చెప్పారు.

Similar News

News November 22, 2025

నాగర్‌కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు

image

నాగర్‌కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ శనివారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

News November 22, 2025

PHOTO GALLERY: గరుడ వాహనంపై తిరుచానూరు అమ్మవారు

image

AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. దీనిని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీవారికి గరుడ సేవ ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతారు. తిరుచానూరులో ఆ సేవ జరిగే టైంలో శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి బంగారు పాదాలను పంపుతారని ప్రతీతి.

News November 22, 2025

దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య

image

HYD అంబర్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు వారి కూతురు శ్రావ్యతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందట వారి పెద్ద కూతురు కూడా సూసైడ్ చేసుకుంది. తర్వాత ఈ ఫ్యామిలీ రాంనగర్ నుంచి అంబర్‌పేట్‌కు మారింది. తమనీ దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురి దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం. దీంతో మూఢనమ్మకాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.