News April 2, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. స్వామి వారి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,981 మంది భక్తులు దర్శించుకోగా 21,120 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.5.09 కోట్ల ఆదాయం సమకూరింది.
Similar News
News December 17, 2025
ఏపీలో 6 జోన్లు.. ఏ జిల్లా ఎక్కడంటే?

రాష్ట్రంలో 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా <<18586844>>కేంద్రం<<>> విభజించింది.
*జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, VZG, అనకాపల్లి.
*జోన్-2: అల్లూరి, తూ.గో., కాకినాడ, కోనసీమ.
*జోన్-3: ప.గో., ఏలూరు, కృష్ణా, NTR.
*జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
*జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప.
*జోన్-6 : కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి.
*మల్టీజోన్-1: జోన్-1, 2, 3
*మల్టీజోన్-2: జోన్-4, 5, 6
News December 17, 2025
చిన్నతనంలో ఊబకాయం రాకూడదంటే..!

చిన్నారుల్లో ఊబకాయం రాకూడదంటే శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు బరువు పెరగవచ్చు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8-9 గంటలు నిద్రపోయేలా టైమ్ టేబుల్ సెట్ చేయండి. పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడానికి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
News December 17, 2025
మూడో నేత్రం తెరుద్దామా?

శివుడికే కాదు మనక్కూడా 3 నేత్రాలు ఉంటాయి. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఆ నేత్రాన్ని తెరవొచ్చని పండితులు చెబుతున్నారు. ‘మన శరీరంలో 7 శక్తి చక్రాలు ఉంటాయి. అందులో మూడోది నుదిటిపై ఉంటుంది. అక్కడ కుంకుమ ధరిస్తే మూడో చక్రం ఉత్తేజితమవుతుంది. అది మన ఆత్మ శక్తిని పెంచుతుంది. అయితే అమ్మాయిలు ప్లాస్టిక్తో చేసిన కృత్రిమ బిందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవట. పాజిటివ్ ఎనర్జీకై సహజ కుంకుమను వాడుదాం.


