News August 11, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీనివాసుడిని 82,628 మంది భక్తులు దర్శించుకోగా 30,505 మంది తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీకి రూ. 3.73 కోట్ల ఆదాయం సమకూరింది.
Similar News
News August 11, 2025
డీఎస్సీ ఫలితాలపై నేడో, రేపో స్పష్టత

AP: మెగా డీఎస్సీ-2025 ఫలితాలపై ఇవాళ లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. ఇటీవల ఫైనల్ కీ విడుదల కాగా.. అందులో తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై విద్యాశాఖ అధికారులు నిపుణుల కమిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ నెల 25లోపు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది.
News August 11, 2025
పాక్ను దెబ్బకొట్టిన ‘వార్ హీరో’ మూవీ తెలుసా?

IAF లెజెండ్ DK పరుల్కర్(రిటైర్డ్) <<17366693>>కన్నుమూసిన<<>> విషయం తెలిసిందే. ఆయన తెగువపై ‘ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్’ అని చిత్రం కూడా వచ్చింది. 1971 ఇండో-పాక్ యుద్ధం టైంలో పరుల్కర్ను పాక్ సైన్యం బంధించి రావల్పిండిలో ఖైదీగా ఉంచింది. శత్రుదేశంలో ఉన్నా అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి తనతోపాటు మరో ఇద్దరు పైలట్స్నూ తప్పించారు. దేశానికి చేసిన సేవలకు గానూ ఆయన వాయుసేన, విశిష్ఠ్ సేవా మెడల్స్ అందుకున్నారు.
News August 11, 2025
దానం చేసిన దేశమే సాయం కోరుతోంది!

ISRO అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతోంది. ఒకప్పుడు అమెరికా దానం చేసిన చిన్న రాకెట్తోనే 1963లో ఇస్రో అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించింది. ఇప్పుడు అదే దేశం స్పేస్ ప్రోగ్రామ్స్కు మన సాయం కోరుతోంది. ప్రపంచంలోనే ఖరీదైన శాటిలైట్ NISARను డెవలప్ చేయడానికి, లాంచ్ చేయడానికి NASA ఇస్రోపైనే ఆధారపడింది. ఇప్పుడు మరో భారీ <<17366188>>శాటిలైట్<<>> లాంచ్ బాధ్యతనూ ISROకే అప్పగించింది. తక్కువ ఖర్చు, సక్సెస్ రేటే ఇందుకు కారణం.