News August 1, 2024
9 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు

TG: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గత నెలాఖరుకు సాగు విస్తీర్ణం 9 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి 83L ఎకరాల్లో పంటలు వేయగా, ఈ ఏడాది 74L ఎకరాల్లోనే సాగు చేశారని తెలిపింది. ముఖ్యంగా వరి, పత్తి, కందులు, మొక్కజొన్న తదితర ప్రధాన పంటల సాగు భారీగా తగ్గిందని పేర్కొంది. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలుగా కాగా, ఇప్పటికి 57 శాతం పంటలే సాగయ్యాయని వివరించింది.
Similar News
News April 4, 2026
మా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. కమల్కు కొత్త తలనొప్పి

TN అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్ హాసన్కు పార్టీ నాయకులు షాక్ ఇస్తున్నారు. పోటీకి దరఖాస్తు సందర్భంగా తమ వద్ద తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలంటున్నారు. తొలుత MNM ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పడంతో 60 మంది రూ.50వేల చొప్పున పార్టీకి చెల్లించి అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కమల్ పోటీ నుంచి దూరంగా ఉంటామని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
News April 4, 2026
ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

ప్రతి ఇంట్లో దాదాపు మహిళలే పూజలు చేస్తుంటారు. కానీ సంకల్ప శ్లోకాలు “ధర్మపత్ని సమేతస్య” అని చెబుతాయి. అంటే భార్య సమేతంగా భర్తే పూజలో ప్రధానం అని అర్థం. భర్త క్షేమం కోసం భార్య చేసే పూజలు మినహా నిత్య పూజలు, ఇతర వ్రతాలను ఇద్దరు కలిసి చేస్తేనే అత్యుత్తమ ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. దీపం వెలిగించడం, సంకల్పం చేయడం, ప్రధాన పూజాచర్యలు నిర్వహించాల్సిన బాధ్యత భర్తదే అని చెబుతున్నారు.
News April 4, 2026
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి.


