News August 16, 2024
తగ్గిన భయాలు.. పెరిగిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మెరుగైన అమెరికా అమ్మకాలు, సీపీఐ డేటా, త్వరలోనే వడ్డీరేట్ల కోత, రిసెషన్ భయాలు తగ్గిపోవడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 505 పాయింట్ల లాభంతో 79609, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి 24295 వద్ద ట్రేడవుతున్నాయి. LTIM, విప్రో, అపోలో హాస్పిటల్స్, M&M, టీసీఎస్ టాప్ గెయినర్స్. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఎక్కువ నష్టపోయాయి.
Similar News
News July 11, 2025
ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

ఎలాన్ మస్క్కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <