News September 18, 2024
కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. భారీగా పెరిగిన గోల్డ్ దిగుమతులు

గోల్డ్పై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది AUGలో $4.83 బిలియన్ల విలువైన పసిడిని భారత్ ఇంపోర్ట్ చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో ఆ మొత్తం $10.6 బిలియన్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ భారీగా తగ్గినట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% దిగుమతులు ఉన్నాయి.
Similar News
News November 24, 2025
బేబీ కార్న్ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<


