News November 3, 2024
ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేయలేదు: HMDA

TG: హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ను నిషేధించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. దీనికి సంబంధించి గత ఏడాది కాలంగా తాము రిజిస్ట్రేషన్&స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదని తెలిపింది. పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
Similar News
News February 1, 2026
కేసీఆర్ను సిట్ అడిగిన ప్రశ్నలివే?

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRను సిట్ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరే ఆదేశించారా? మీ పార్టీ MLAలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాప్ జరిగింది? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని మీరే కోరారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. వీటికి KCR తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.
News February 1, 2026
8మంది MPలను ఇస్తే తిరిగిచ్చింది గుండు సున్నా: బడ్జెట్పై కవిత ఫైర్

TG: బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి ఎదురైందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP MPలను ఇస్తే బదులుగా గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ₹34,367 కోట్ల RRR, మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను కేంద్రం విస్మరించిందన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, IIM వంటి కీలక డిమాండ్లను పట్టించుకోలేదన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్పై కఠినంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రెండేళ్లుగా సీరియల్ కింద సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘జడ్జీలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారు. తన భర్త ఫోనూ ట్యాప్ చేశారని కవిత అన్నారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు తమ వాటాల కోసం కొట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.


