News April 5, 2025

2034 తర్వాతే జమిలి ఎన్నికలు: నిర్మల

image

2029లోపే ‘జమిలి’ని అమలు చేస్తారనే వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామన్నారు. ‘2024 LS ఎన్నికలకు ₹లక్ష కోట్లు ఖర్చయ్యింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే GDP 1.5% వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవస్థకు ₹4.50L Crను జోడించవచ్చు’ అని చెప్పారు.

Similar News

News February 4, 2026

$852 బిలియన్లకు మస్క్ సంపద

image

స్పేస్‌ఎక్స్, xAI విలీనంతో ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ డీల్ తర్వాత ఆయన నెట్ వర్త్ $852 బిలియన్లకు చేరింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ విలువ $1.25 ట్రిలియన్లుగా ఉండగా ఈ ఒక్క ఒప్పందం వల్లే మస్క్ సంపదకు అదనంగా $84 బిలియన్లు తోడయ్యాయి. మస్క్ తర్వాత లారీ పేజ్ $278 బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.

News February 4, 2026

మమత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఈసీకి నోటీసులు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ CM మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ECIకి నోటీసులిచ్చింది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా నేరుగా కోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.

News February 4, 2026

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.