News July 18, 2024
20న నీట్ ఫలితాలు విడుదల చేయండి: సుప్రీంకోర్టు

ఈ నెల 20వ తేదీన నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజల్ట్స్ ప్రకటించాలంది. పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలను ఇవ్వాలని పేర్కొంది.
పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు వెల్లడించేటప్పుడు విద్యార్థులు వివరాలు కనిపించకుండా చూడాలంది. నీట్- యూజీ సంబంధిత పిటిషన్లపై <<13652777>>విచారణ<<>>ను జులై 22కి వాయిదా వేసింది.
Similar News
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం ఉచిత మాక్ టెస్టులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (1/2)

మనిషి స్పేస్ జర్నీ ఈజీ చేసేందుకు మనకంటే ముందు కొన్ని ప్రాణులు స్పేస్లోకి వెళ్లాయి. 1947లో USA సైంటిస్ట్స్ ఫ్రూట్ ఫ్లైస్(ఓ జాతి ఈగ)ను పంపారు. రేడియేషన్, జీవక్రియ, ప్రత్యుత్పత్తి తదితరాలపై రీసెర్చ్ కోసం పంపిన అవి తిరిగొచ్చాయి. 1949లో కోతిని పంపగా పారాచూట్ ఫెయిలై వెనక్కి రాలేదు. 1957లో స్పుత్నిక్2లో వీధి కుక్క లైకాను రష్యా పంపింది. భూ కక్ష్యలో అడుగుపెట్టిన తొలి జంతువు ఆ వెదర్లో కొంతసేపే బతికింది.
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (2/2)

1960లో స్పుత్నిక్5తో వెళ్లిన డాగ్స్ బెల్కా, స్ట్రెల్కా తిరిగొచ్చాయి. మనుషులు స్పేస్ జర్నీ చేయగలరని వీటితోనే తెలిసింది. 1961లో నాసా ఓ చింపాంజీని పంపి మెదడు పనితీరు పరిశీలించింది. నరాల పనితీరుపై అధ్యయనం కోసం France 1963లో పిల్లిని, 2007లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటర్ బేర్ను పంపింది. స్పేస్లో ఆక్సిజన్ కొరత, రేడియేషన్ను ఇవి తట్టుకున్నాయి.
-1961: యూరి గగారిన్ స్పేస్లోకి వెళ్లిన తొలి మనిషి


