News July 2, 2024

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదల

image

TG: రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.

Similar News

News July 5, 2024

చిన్ననాటి కోచ్‌తో కోహ్లీ.. ఫొటోలు వైరల్

image

ముంబైలో టీ20 వరల్డ్‌కప్ సెలబ్రేషన్స్ తర్వాత విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను రాజ్‌కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘విరాట్.. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ నుంచి ఇంత గొప్ప సక్సెస్ సాధించే వరకూ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

News July 5, 2024

అసలు కథ అంతా సీక్వెల్‌లోనే: నాగ్ అశ్విన్

image

‘కల్కి 2898ఏడీ’ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీం యాస్కిన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, ఈ పాత్రల అసలు కథంతా సీక్వెల్‌లోనే ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఆ ముగ్గురి మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలక పాత్ర పోషించనుంది. సీక్వెల్‌కు సంబంధించి నెల రోజులు షూట్ చేశాం. బాగా వచ్చింది. ఇంకా తీయాల్సి ఉంది. వీటిలో భారీ యాక్షన్ సీక్వెన్సులుంటాయి’ అని పేర్కొన్నారు.

News July 5, 2024

కవిత జుడీషియల్ రిమాండ్‌ పొడిగింపు

image

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది.