News July 2, 2024

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదల

image

TG: రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.

Similar News

News March 31, 2026

విద్యార్థి సంఘాలపై నేపాల్ పీఎం బ్యాన్

image

స్టూడెంట్ పాలిటిక్స్‌పై నేపాల్ కొత్త ప్రధాని బాలెన్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలపై నిషేధం విధించారు. ఆ స్థానంలో స్టూడెంట్ కౌన్సిల్స్ తీసుకొస్తామన్నారు. యూనివర్సిటీల్లో రాజకీయాలకు పనేంటని బాలెన్ షా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జెన్‌జీ నిరసనల్లో చనిపోయిన 27 మంది విద్యార్థుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున ఉద్యోగాలు కల్పించారు.

News March 31, 2026

మాడిపోతున్న వేప చెట్లు.. కారణం, నివారణ ఇలా!

image

ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లకు పెద్ద కష్టం వచ్చింది. AP, TGలో వేలాది చెట్లు ఎండిపోతున్నాయి. దీనికి ‘డైబ్యాక్’ అనే వ్యాధి కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఆకులపై కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలని, చెట్టు మొదలులో వర్మీ కంపోస్ట్ వేయాలని సూచిస్తున్నారు. చెట్లను కాపాడటానికి అధికారులే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
* మీ ఏరియాలోనూ వేప చెట్లకు ఇలా అవుతోందా?
#ShareIt

News March 31, 2026

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సంతానోత్పత్తి రేటు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి నూతన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల శాతం 70గా ఉండగా దానిని 50%కు తగ్గిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది.