News July 2, 2024

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదల

image

TG: రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం విడుదలయ్యే వారిలో 205 మంది జీవిత ఖైదు పడ్డవారే ఉన్నారు.

Similar News

News December 21, 2025

సూపర్ ఫామ్‌లో కాన్వే.. మరో సెంచరీ

image

వెస్టిండీస్‌తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ NZ ఓపెనర్ కాన్వే సెంచరీ చేశారు. 136 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ మార్క్ అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయన <<18609470>>డబుల్ సెంచరీ<<>> సాధించారు. దీంతో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. కాగా ఈ మాజీ CSK ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సంగతి తెలిసిందే.

News December 21, 2025

రాష్ట్రంలో 182 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

APలోని 26 జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో 182 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని చేస్తున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 35-65ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: wdcw.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 21, 2025

NLCIL 575పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(<>NLCIL<<>>) 575 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, డిప్లొమా ఉత్తీర్ణులు JAN 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీలను JAN 9 వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15,028, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.12524 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.nlcindia.in