News November 19, 2024

లోకేశ్ చొరవతో అయ్యప్ప భక్తుల విడుదల

image

AP: జీడి నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింతకు చెందిన అయ్యప్ప భక్తులు కేరళ వెళ్తుండగా వాహనానికి ప్రమాదం జరిగింది. అక్కడి పోలీసులు స్టేషన్లో ఉంచగా, తమను ఆదుకోవాలని వారు సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ను కోరారు. సురక్షితంగా తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడి అధికారులతో లోకేశ్ టీం మాట్లాడగా, వారిని పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అయ్యప్ప భక్తులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 14, 2026

10నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

image

కేరళలో రోడ్డుప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పది నెలల పసికందు అలిన్ షెరిన్ ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ పేరెంట్స్ నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.

News February 14, 2026

కొత్తగూడెం మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం: సీపీఐ

image

TG: కొత్తగూడెంలో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఇప్పటికే KTR కాల్ చేసి BRS తరఫున మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు. ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నారు. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామని తెలిపారు. కాగా EC ప్రకారం ఇక్కడ CPI 22, CONG 22, BRS 8, ఇండిపెండెంట్లు 6 సీట్లు, BJP, CPM తలో చోట గెలిచాయి.

News February 14, 2026

ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

image

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం