News November 19, 2024
లోకేశ్ చొరవతో అయ్యప్ప భక్తుల విడుదల

AP: జీడి నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింతకు చెందిన అయ్యప్ప భక్తులు కేరళ వెళ్తుండగా వాహనానికి ప్రమాదం జరిగింది. అక్కడి పోలీసులు స్టేషన్లో ఉంచగా, తమను ఆదుకోవాలని వారు సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్ను కోరారు. సురక్షితంగా తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడి అధికారులతో లోకేశ్ టీం మాట్లాడగా, వారిని పోలీసులు విడిచిపెట్టారు. దీంతో అయ్యప్ప భక్తులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 12, 2025
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.
News December 12, 2025
నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

టాలీవుడ్ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.


