News May 3, 2024
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర అవసరాల మేరకు దీన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘గత హామీ మేరకు ITIR ప్రాజెక్టును ప్రారంభిస్తాం. భద్రాచలం వద్ద APలో విలీనమైన 5గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం. సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మిస్తాం’ అని తెలిపారు.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


