News May 3, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర అవసరాల మేరకు దీన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘గత హామీ మేరకు ITIR ప్రాజెక్టును ప్రారంభిస్తాం. భద్రాచలం వద్ద APలో విలీనమైన 5గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం. సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మిస్తాం’ అని తెలిపారు.

Similar News

News October 15, 2025

ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

image

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.

News October 15, 2025

ప్రతి విద్యార్థి స్కూల్లో ఉండాలి: భట్టి విక్రమార్క

image

TG: విద్యారంగం ప్రతిష్టాత్మకమైందని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రగతిపై సమీక్షించారు. ‘పథకంలో సమస్యలుంటే యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి. విద్యార్థులను పంపేయడానికి వీల్లేదు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి’ అని భట్టి ఆదేశించారు.

News October 15, 2025

GDP గ్రోత్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్

image

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(IMF) 2025కు గాను ఇండియా GDP గ్రోత్‌ను రివైజ్ చేసింది. ఈ ఏడాదికి 6.4% గ్రోత్ ఉంటుందని పేర్కొన్న IMF దానిని 6.6%కు పెంచింది. 2026లో అది 6.2% ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికం. గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది 3.2% కాగా, వచ్చే ఏడాది 3.1%కు తగ్గొచ్చంది. US గ్రోత్ ఈ ఏడాది 2.0% ఉండగా 2026లో 2.1%కు పెరగొచ్చని తెలిపింది.