News July 30, 2024
CDPO, EO పోస్టుల ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. CDPO అభ్యర్థులకు జనవరి 3, 4న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్(E0) అభ్యర్థులకు జనవరి 6, 7న పరీక్షలు ఉంటాయంది. గతేడాది నిర్వహించిన ఈ రెండు పరీక్షలను క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంగా టీజీపీఎస్సీ రద్దు చేసింది. 23 CDPO, 181 ఈవో పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.
Similar News
News April 3, 2026
ఈ నెల 5న జగ్జీవన్ రామ్ జయంతి: కలెక్టర్

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.
News April 3, 2026
IPL: టాస్ గెలిచిన PBKS

చెన్నై వేదికగా CSKతో జరగనున్న మ్యాచులో PBKS టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, ప్రశాంత్ వీర్, దూబే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
PBKS: ప్రభ్సిమ్రన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్, విజయ్కుమార్, అర్ష్దీప్, చాహల్
News April 3, 2026
ఈ క్షీరదం పాలు నీటిలో కలిసిపోవు!

సముద్రపు వింతల్లో తిమింగలం పాలు ఒకటి. ఇవి ఆవు పాలలా పల్చగా ఉండవు. వెన్న మాదిరిగా గట్టిగా ఉంటాయి. ఇందులో 50% కొవ్వు ఉండటమే దీనికి కారణం. ఈ చిక్కదనం వల్ల పాలు నీటిలో కలిసిపోవు. దీనివల్ల తిమింగలం పిల్లలు నీటి అడుగున కూడా సులభంగా పాలు తాగగలుగుతాయి. ఈ అధిక కొవ్వు సముద్రపు చలిని తట్టుకోవడానికి అవసరమైన శక్తిని పిల్లలకు అందిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (37/100)


