News August 6, 2024
MLC ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, SEP 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. GVMC కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTC, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, YCPకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేయగా, కూటమి ఇంకా పేరు ఖరారు చేయలేదు.
Similar News
News November 19, 2025
వన్డేల్లో తొలి ప్లేయర్గా రికార్డు

వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫుల్ మెంబర్ టీమ్స్ అన్నింటిపై సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా నిలిచారు. అటు వన్డేల్లో హోప్ 19 సెంచరీలు నమోదు చేశారు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ ఫుల్ మెంబర్స్ టీమ్స్. కాగా ఇవాళ్టి రెండో వన్డేలో వెస్టిండీస్పై NZ గెలిచింది.
News November 19, 2025
సూసైడ్ బాంబర్: క్లాసులకు డుమ్మా.. ఆర్నెళ్లు అజ్ఞాతం!

ఢిల్లీ పేలుళ్ల బాంబర్ ఉమర్కు అల్ ఫలాహ్ వర్సిటీ స్వేచ్ఛ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అతడు క్లాస్లకు సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా 15 ని.లు మాత్రమే ఉండేవాడని సహచర వైద్యులు విచారణలో తెలిపారు. 2023లో ఆర్నెళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడన్నారు. ఉమర్ను తొలగించాల్సి ఉన్నాతిరిగి రాగానే వర్సిటీ విధుల్లో చేర్చుకుందని చెప్పారు. పోలీసుల వరుస విచారణలతో డాక్టర్లు, స్టూడెంట్లు వర్సిటీ నుంచి వెళ్లిపోతున్నారు.
News November 19, 2025
72 గంటల పనివేళలు వారికోసమే: పాయ్

నారాయణ మూర్తి ప్రతిపాదించిన వారానికి 72 గంటల <<18309383>>సలహాను<<>> పారిశ్రామిక వేత్త మోహన్దాస్ పాయ్ గట్టిగా సమర్థించారు. అయితే ఈ సూచన సాధారణమైన ఉద్యోగులకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కఠిన నిబంధన కేవలం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకునే పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆవిష్కర్తలకు మాత్రమే వర్తిస్తుందని పాయ్ అన్నారు. గ్లోబల్ పోటీని తట్టుకోవడానికి ఇన్నోవేటర్లు ఈ అంకితభావం చూపాలని ఆయన తెలిపారు.


