News August 6, 2024

MLC ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

image

AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, SEP 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. GVMC కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTC, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, YCPకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేయగా, కూటమి ఇంకా పేరు ఖరారు చేయలేదు.

Similar News

News December 9, 2025

ఎన్యూమరేటర్లకు బెదిరింపులు.. ECIకు సుప్రీం నోటీసులు

image

SIR చేపట్టిన BLOలకు భద్రత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలపాలని ECI, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. డోర్-టు-డోర్ సర్వేకు వెళ్లిన వారిని ముఖ్యంగా బెంగాల్‌లో అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని వేసిన రెండు పిటిషన్లను CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ బెంచ్ నేడు విచారించింది. పరిస్థితిని అదుపులోకి తేవాలని లేదంటే దారుణాలు జరుగుతాయని ECని CJI ఆదేశించారు.

News December 9, 2025

ట్రెండ్‌ను ఫాలో అవుతున్న అభ్యర్థులు.. SMలో జోరుగా ప్రచారం!

image

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి కొత్త ఒరవడి కనిపిస్తోంది. అభ్యర్థులు ప్రజాక్షేత్రంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. MLA ఎన్నికల మాదిరిగా ప్రత్యేక పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ ఊర్లో ఉంటూ రీల్స్ చేసే యువ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా పోటీలో ఉండటం విశేషం. దీంతో పోటీదారులు సంప్రదాయ రాజకీయాలను పక్కనపెట్టి కొత్త ట్రెండ్‌కు తెరలేపారు. వీరు యువతను ఆకర్షించేందుకే మొగ్గుచూపుతున్నారు.

News December 9, 2025

డిజిటల్‌గా జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

image

జనగణన-2027ను డిజిటల్‌గా చేపట్టనున్నట్లు కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ‘మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తాం. ప్రజలు వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు అందించే అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరి వివరాలను ప్రస్తుతం వారు నివసిస్తున్న చోటే సేకరిస్తాం. వారు జన్మించిన ప్రాంతం, గతంలో నివసించిన చోటు నుంచి కూడా డేటా తీసుకుంటాం. వలసలకు కారణాలు తెలుసుకుంటాం’ అని వివరించింది. జనగణన <<18451693>>రెండు దశల్లో<<>> జరగనుంది.