News May 2, 2024

నీట్-యూజీ అడ్మిట్ కార్డులు విడుదల

image

దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 5న జరిగే ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో 557 కేంద్రాలు, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు హాల్‌‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News March 17, 2026

‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

image

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్‌పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.

News March 17, 2026

SGSW ఉద్యోగులు.. ఆలస్యమైతే లీవ్ కట్

image

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) ఉద్యోగుల హాజరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 10.30amలోగా హాజరు నమోదు చేయాలని, 10min గ్రేస్ టైమ్ ఉంటుందని స్పష్టం చేసింది. 10.40am తర్వాత హాజరు నమోదైతే హాఫ్ డే సెలవుగా, 2.01pm-5pm మధ్య హాజరు నమోదైతే పూర్తి రోజు సెలవుగా పరిగణించనుంది. ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌లో ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. DDO అనుమతితో నెలకు 3 రోజులు దీని నుంచి మినహాయింపు పొందొచ్చు.

News March 17, 2026

జగ్గారెడ్డి PCC చీఫ్ అయితే 100 సీట్లు గ్యారంటీ: కోమటిరెడ్డి

image

TG: PCC చీఫ్‌గా జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జగ్గారెడ్డి మరొక PJR. ఆయన లాగే ప్రజా నాయకుడు. జగ్గారెడ్డి PCC చీఫ్‌గా ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లలో గెలుస్తుంది. మహేశ్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డిని PCC చీఫ్‌గా చేయాలి’ అని సూచించారు.