News April 1, 2024

పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష AP PGCET-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మే 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీలు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.650 చెల్లించాలి. మే 31 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూన్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News March 8, 2026

బంగ్లాలో ‘Gen Z’ పార్టీ ఎందుకు ఓడింది?(1/2)

image

బంగ్లాదేశ్‌లో హసీనా, నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వాలు కూలిపోవడానికి Gen Z నిరసనలే కారణం. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేసింది. అయితే బంగ్లాలో స్టూడెంట్స్ నహిద్, హస్నాత్, అఖ్తర్ ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. హింసను నమ్ముకోవడం, ప్రజలకు భరోసా కల్పించలేకపోవడం, రాజకీయ అనుభవలేమి, వివాదాలు ప్రధాన కారణం. అటు నేపాల్‌లో Gen Z ఎన్నికల్లో సత్తా చాటింది.

News March 8, 2026

నేపాల్‌లో ‘Gen Z’ ఎలా గెలిచింది?(2/2)

image

నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వం SMపై నిషేధం విధించడంతో Gen Z తిరుగుబాటు చేసింది. ఈ ఉద్యమంలో బాలెన్ షా కీలక పాత్ర పోషించారు. ర్యాపర్‌గా రాజకీయ అవినీతి, ప్రజాసమస్యలను పాటల రూపంలో వివరించారు. నిరసనల సమయంలోనే PM ఆఫర్ వచ్చినా ఆయన తిరస్కరించి కాఠ్‌మాండూ మేయర్‌గా గెలిచారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP)లో చేరి ప్రజల ఇబ్బందులపై దృష్టిసారించారు. యువతను సరైన దారిలో నడిపిస్తూ గెలుపు బావుటా ఎగురవేశారు.

News March 8, 2026

ట్రంప్‌ను వదిలేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

image

అయతుల్లా ఖమేనీ మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరించారు. తమ నాయకుడు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని Xలో స్పష్టం చేశారు. ‘ఇరాన్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాలను US ఉపయోగించుకోకుండా మిడిల్ ఈస్ట్ దేశాలు నిరోధించాలి. ఆ ప్రాంతాల నుంచి దాడి జరిగితే మేం ప్రతిస్పందిస్తాం’ అని తేల్చిచెప్పారు. IRGC కొందరు అమెరికన్ సైనికులను బంధించిందని పేర్కొన్నారు.