News July 31, 2024
పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

AP: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. పేరెంట్స్ కమిటీల పదవీకాలం పూర్తవడంతో ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. 8న కమిటీ సభ్యుల ఎన్నిక, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
పెద్దపల్లిలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడలు

పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్గ్రౌండ్లో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, డీడబ్ల్యూఓ ఇంచార్జ్ కవిత, రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ తదితర అధికారులు ప్రారంభించారు. చెస్, క్యారమ్స్, జావెలిన్, రన్నింగ్, షాట్పుట్ విభాగాల్లో 300 మంది వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్ల్యూసీడీ & ఎస్సీ శాఖ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
News November 28, 2025
వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT
News November 28, 2025
భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?


