News May 24, 2024

టెన్త్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల

image

AP: టెన్త్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 55,966 మంది దరఖాస్తు చేసుకోగా, 43,714 మంది ఆన్సర్ షీట్ల రిజల్ట్స్‌‌ను రిలీజ్ చేసింది. మిగతా విద్యార్థుల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పాఠశాలల హెడ్‌మాస్టర్ల లాగిన్ నుంచి ఫలితాల కాపీలను పొందవచ్చన్నారు.

Similar News

News December 10, 2025

చీకటి గదిలో ఫోన్ చూస్తున్నారా?

image

చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం అలవాటు. అలా చూడటం కళ్లకు మంచిది కాదని తెలిసినా ‘తప్పదు’ అని లైట్ తీసుకుంటారు. అయితే ఆ ‘లైట్’ ముఖ్యం అంటున్నారు వైద్యులు. గదిలోని అన్ని లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని కాంతి నేరుగా కళ్లపై పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రివేళ ఫోన్ చూసినప్పుడు తప్పనిసరిగా గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

News December 10, 2025

వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

image

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.

News December 10, 2025

వివేకా హత్యకేసులో కోర్టు కీలక ఆదేశాలు

image

TG: వివేకా హత్యకేసులో పలు అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని CBIని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు కోర్టు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగుల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.