News August 19, 2024

రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయండి: బండి

image

TG: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మాఫీ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. దీనిపై కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. విలీనం పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

Similar News

News November 13, 2025

భూ కబ్జా ఆరోపణలు.. పవన్‌కు వైసీపీ సవాల్

image

AP: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట <<18274471>>Dy.CM పవన్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని YCP మండిపడింది. ‘ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా’ అని పవన్‌కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను Xలో షేర్ చేసింది. ‘పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని పేర్కొంది.

News November 13, 2025

కూరగాయల సాగు.. ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

image

TG: రాష్ట్రంలో ఏటా 10వేల ఎకరాల మేర కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు ఈ సీజన్ నుంచే ఎకరాకు రూ.9,600 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అటు పలు రకాల కూరగాయల నారు కూడా సిద్ధం చేసింది. నారు అవసరం ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. నారు, సబ్సిడీ కావాల్సిన రైతులు సంబంధిత మండలాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News November 13, 2025

శీతాకాలంలో స్కిన్‌ బావుండాలంటే..

image

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.