News September 27, 2024
ఏపీకి రిలయన్స్ రూ.20 కోట్ల విరాళం

APలో వరద బాధితుల కోసం రిలయన్స్ సంస్థ భారీ విరాళం అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ తరఫున రూ.20 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు మెంబర్ ప్రసాద్, సంస్థ మెంటార్ మాధవరావు ఇచ్చారు. అటు ITC గ్రూప్ రూ.2 కోట్లు, LG పాలిమర్స్ సంస్థ రూ.2 కోట్లు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా మోహన్ బాబు రూ.25 లక్షల విరాళం సీఎంకు అందించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


