News October 7, 2024

5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO

image

JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.

Similar News

News October 7, 2024

పాత ఉద్యోగికి రూ.23వేల కోట్ల ఆఫర్ ఇచ్చిన గూగుల్

image

ఓల్డ్ ఎంప్లాయీని తిరిగి తీసుకొచ్చేందుకు గూగుల్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. AI ఎక్స్‌పర్ట్ నోవమ్ షాజీర్‌కు ఏకంగా రూ.23000 కోట్లు ఆఫర్ చేసింది. 2000లో జాయిన్ అయిన నోవమ్ తన MEENA చాట్‌బోట్‌ను మార్కెట్లోకి తీసుకురాలేదని రెండేళ్ల క్రితం వెళ్లిపోయారు. సొంతంగా Character.AIను నెలకొల్పారు. అది ఆర్థిక కష్టాల్లో పడటంతో గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ AI ప్రాజెక్ట్ జెమినీకి VPని చేసింది.

News October 7, 2024

సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత

image

ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అమ్మ మరణించడం మాకు తీరని లోటు. ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఎంతో ప్రేమ, ఆనందాన్ని అందరితోనూ పంచుకునేవారు’ అని రాసుకొచ్చారు. ఈయన హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ వందలాది సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు చిత్రాలకు మ్యూజిక్ కూడా అందించారు.

News October 7, 2024

విమానంలో అడల్ట్ మూవీ.. షాకైన ప్యాసింజర్స్

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు వెళుతున్న క్వాంటస్ విమానంలోని అన్ని స్క్రీన్లలో ఒక్కసారిగా అడల్ట్ మూవీ ప్లే అయ్యింది. మూవీ తమ స్క్రీన్లపై ప్రసారం కాగా దాన్ని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగినట్లు పేర్కొన్న ఎయిర్‌లైన్స్, ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.