News August 28, 2024

పేటీఎం‌కు ఊరట: విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి

image

పేటీఎం పేమెంట్ బ్యాంకు సర్వీసెస్‌లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. అనుమతి రావడంతో పేమెంట్ బ్యాంక్స్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. భారతీయ కంపెనీగా తాము నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని పేర్కొంది. గతంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పేమెంట్ బ్యాంకు సేవల్ని ఆర్బీఐ నిషేధించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 26, 2025

‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

News November 26, 2025

‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

News November 26, 2025

సర్పంచులకు జీతం ఎంతంటే?

image

TG: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సర్పంచుల జీతంపై చర్చ జరుగుతోంది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఉండేది. ఆ తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఎంపీటీసీలకు రూ.6,500, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13,000, జడ్పీ ఛైర్మన్లకు రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.