News January 7, 2025
వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట

AP: మాజీ CM YS జగన్కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.
Similar News
News October 17, 2025
646 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే సమయం

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే (OCT 20) సమయం ఉంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.cdac.in
News October 17, 2025
షోడశోపచార పూజతో శివపథం

పరమశివుని అనుగ్రహం పొందడానికి శివ లింగానికి షోడశోపచార పూజ చేయడం అత్యుత్తమని శివ మహాపురాణం చెబుతోంది. ఆవాహనం నుంచి ఉద్వాసన వరకు 16 భక్తియుక్త సేవలతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే.. పవిత్రమైన అభిషేకం, ప్రేమపూర్వక నైవేద్యం, భక్తితో నమస్కారాలు చేసినా సరిపోతుంది. ఈ ఆరాధనలు భక్తులను తరింపజేస్తాయి. పరమ శివుని దివ్యలోకమైన ‘శివపథాన్ని’ అందిస్తాయి. ఈ సేవలే ముక్తికి మార్గాలు. <<-se>>#SIVOHAM<<>>
News October 17, 2025
నేడు రామ ఏకాదశి.. ఏం చేయాలంటే?

ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి రోజున ‘రామ ఏకాదశి’ జరుపుకొంటారు. నేడు ఏకాదశి వ్రతం చేస్తే శుభం కలుగుతుందని స్కంద పురాణం పేర్కొంది. ‘ఈ శుభ దినాన లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తులసి ఎదుట దీపం వెలిగించి, దైవ ప్రార్థన చేయాలి. దానధర్మాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఉపవాసం శుభప్రదం. నారాయణ జపం, రామ ఏకాదశి కథ వినడం వల్ల పుణ్యం కలుగుతుంది’ అని పండితులు చెబుతున్నారు .