News January 7, 2025
వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట

AP: మాజీ CM YS జగన్కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.
Similar News
News August 27, 2025
ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్కు క్యాన్సర్

తాను చర్మ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘ప్రస్తుతం నేను స్కిన్ క్యాన్సర్తో పోరాడుతున్నా. ట్రీట్మెంట్లో భాగంగా వైద్యులు నా ముక్కు వద్ద కొంత చర్మాన్ని కట్ చేశారు. చికిత్స కంటే నివారణ మేలు. కానీ నా విషయంలో రెగ్యులర్ చెకప్స్ కీలకం’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా క్లార్క్కు క్యాన్సర్ ఉన్నట్లు 2006లోనే వైద్యులు నిర్ధారించారు.
News August 27, 2025
రష్యాతో ఎనర్జీ డీల్స్పై చర్చించిన US?

ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం ఈనెల 16న పుతిన్, ట్రంప్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఎనర్జీ డీల్స్పై చర్చ జరిగినట్లు Reuters తాజాగా వెల్లడించింది. యుద్ధం ఆపేందుకు ఆంక్షలు ఎత్తివేస్తామని, పెట్టుబడులకు అనుమతిస్తామని రష్యాకు US ఆఫరిచ్చినట్లు పేర్కొంది. త్వరలో US టాప్ ఆయిల్ కంపెనీ Exxon Mobil రష్యాలో రీఎంట్రీ ఇవ్వొచ్చంది. ఇరు దేశాలు ట్రేడింగ్ కూడా రీస్టార్ట్ చేయొచ్చని తెలిపింది.
News August 27, 2025
TCS కొత్త ఆఫీస్ అద్దె రూ.2,130 కోట్లు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బెంగళూరులో కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఇందుకు బెంగళూరులోని 360 బిజినెస్ పార్క్ టవర్స్ యాజమాన్యంతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయానికి 15 ఏళ్లకుగానూ రూ.2,130 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.9.31 కోట్ల అద్దెతో రూ.112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ప్రతి మూడేళ్లకూ 12 శాతం అద్దె పెంపు ఉండనుంది.