News January 7, 2025
వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట

AP: మాజీ CM YS జగన్కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.
Similar News
News November 10, 2025
CSK నుంచి జడేజా ఔట్?

రాజస్థాన్తో ట్రేడ్ డీల్లో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. RR నుంచి సంజూను తీసుకునేందుకు చెన్నై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా ఇన్స్టా అకౌంట్ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ డీల్ తర్వాత ఫ్యాన్స్ వార్ను నివారించడానికి అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నారా? లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియరాలేదు.
News November 10, 2025
ప్రచారం కోసం పిటిషన్లా? కేఏ పాల్పై సుప్రీం ఆగ్రహం

ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిల్స్ దాఖలు చేస్తున్నారని మండిపడింది. PPP అంశంపై ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
News November 10, 2025
6 గంటల్లోనే జీవ వ్యర్థాల నుంచి జీవ ఎరువుల తయారీ

జీవవ్యర్థ పదార్థాలను జీవ ఎరువులుగా మార్చే పరిశ్రమ త్వరలో HYDలోని ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో.. వర్సిటీ ఒప్పందం చేసుకుంది. రూ.5 కోట్లతో ఈ ఎరువుల యూనిట్ను 2 నెలల్లోనే ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. జీవవ్యర్థాల నుంచి 6 గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేయవచ్చని ‘బయోవే’ సంస్థ ప్రతినిధులు తెలిపారు.


