News April 7, 2025

ధరల్లో మార్పులు చేయవద్దు: ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచన

image

పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్‌కు రూ.2 చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించింది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటించింది. ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు.

Similar News

News April 7, 2025

వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

image

HDFCలో లోన్లు(హోమ్, పర్సనల్, వెహికల్) తీసుకున్న వారికి శుభవార్త. వడ్డీ రేట్లపై 10 బేసిక్ పాయింట్లను బ్యాంక్ తగ్గించింది. దీంతో ఒక్క రోజు నుంచి మూడేళ్ల వ్యవధిలోని లోన్లపై వడ్డీ 9.10 నుంచి 9.35 శాతం మధ్య ఉండనుంది. గతంలో ఈ రేట్లు 9.20-9.45 శాతంగా ఉండేవి. ఇవాళ్టి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

News April 7, 2025

బిగ్‌బాస్ సీజన్-9కు బాలయ్య హోస్ట్?

image

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. తొమ్మిదో సీజన్‌కు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపినట్లు టాక్. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

News April 7, 2025

ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టేయండి: పోలీసులు

image

TG: SIB మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టులో పోలీసులు కౌంటర్ పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచిలో SOT అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది ప్రభాకర్ రావే అన్నారు. ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా SOT పనిచేసిందన్నారు. ఉన్నత అధికారిగా పదవీ విరమణ పొందిన వ్యక్తి కూడా చట్టపరమైన దర్యాప్తునకు సహకరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

error: Content is protected !!