News November 12, 2024
BRS ఎమ్మెల్యే మాగంటికి ఊరట

TG: జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆధారాలు లేని పిటిషన్ కొట్టేయాలని మాగంటి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేయగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణపై స్టే విధించింది. దీంతో పాటు ప్రతివాది అజహరుద్దీన్కు నోటీసులు జారీ చేసింది.
Similar News
News November 21, 2025
జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్వాంటెడ్ మెసేజ్లు ఇన్బాక్స్లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 21, 2025
FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్లో మార్చి 8న ఫైనల్తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.
News November 21, 2025
25న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఎన్నికలే అజెండా!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈ నెల 25న భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికలే అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి.


