News October 16, 2024
కాసేపట్లో ఐఏఎస్ల రిలీవింగ్ ఉత్తర్వులు

TG: ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఈ నలుగురూ ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరు రిలీవ్ కానున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ, టూరిజం, మహిళ-శిశు సంక్షేమశాఖ, GHMC కమిషనర్ను ప్రభుత్వం వేరే అధికారులతో భర్తీ చేయనుంది.
Similar News
News January 7, 2026
జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
News January 7, 2026
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4,6,4,6

సౌతాఫ్రికా U-19తో మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయారు. 7వ ఓవర్లో వరుసగా 4,6,4,6 బౌండరీలు బాదారు. ఈక్రమంలోనే అతడు 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం వైభవ్(56)తో పాటు ఆరోన్ జార్జ్(51) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 111 రన్స్ జోడించారు.
News January 7, 2026
బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్ రీషఫుల్?

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రులను తొలగిస్తారని సమాచారం. ముఖ్యంగా మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో పార్టీ సీనియర్లు, సంఘ్ సన్నిహితులకు చోటు లభిస్తుందని చెబుతున్నారు. కాగా EX బ్యూరోక్రాట్స్ అయిన జైశంకర్, హర్దీప్, అర్జున్ రాం, అశ్వినీ వైష్ణవ్ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు.


