News October 1, 2024

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ అనే ఫీచర్ రానుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌లో ‘రిమైండర్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే యూజర్లకు అన్‌సీన్ స్టేటస్‌ల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. దీని వల్ల రెగ్యులర్‌గా స్టేటస్‌లు చూడని వారు, కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే వారు ముఖ్యమైన అప్‌డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫేవరెట్/ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్స్ స్టేటస్‌లపైనే ఇది ఫోకస్ చేస్తుందని సమాచారం.

Similar News

News September 13, 2025

కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

image

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.

News September 13, 2025

ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

image

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.

News September 13, 2025

ALERT: ITR ఫైల్ చేయడం లేదా?

image

2024-25FYకి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) ఫైల్ చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. కేంద్రం రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని చాలామంది ఫైల్ చేయడం లేదు. కానీ ఈ నిర్ణయం 2025-26 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో ఆదాయం రూ.3 లక్షలు దాటినవారు కూడా ఇప్పుడు ITR ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. SEP 15 డెడ్‌లైన్ దాటితే రూ.5వేల వరకు పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారు.