News October 1, 2024
వాట్సాప్లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ ఫీచర్

వాట్సాప్లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ అనే ఫీచర్ రానుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్స్ సెట్టింగ్స్లో ‘రిమైండర్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే యూజర్లకు అన్సీన్ స్టేటస్ల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. దీని వల్ల రెగ్యులర్గా స్టేటస్లు చూడని వారు, కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే వారు ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫేవరెట్/ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్స్ స్టేటస్లపైనే ఇది ఫోకస్ చేస్తుందని సమాచారం.
Similar News
News October 13, 2025
ఐ మేకప్ తీయకుండా పడుకుంటున్నారా?

రాత్రిళ్లు పడుకొనేముందు మేకప్ తియ్యడం తప్పనిసరి. ముఖ్యంగా ఐమేకప్ తియ్యకపోతే పలు సమస్యలు వస్తాయంటున్నారు చర్మ నిపుణులు. కళ్ల కింద నల్లటి వలయాలు, ఐ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే కనురెప్పలకు వేసే మస్కారా తీయకపోవడం వల్ల కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోయి వాటికి తేమ అందదు. వాటి సహజత్వం కోల్పోయి పెళుసుబారి విరిగిపోతాయి. కాబట్టి రాత్రిపూట కళ్లకు వేసుకున్న మేకప్ తొలగించడం మంచిదని సూచిస్తున్నారు.
News October 13, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది.
News October 13, 2025
కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

కజిరంగా నేషనల్ పార్క్ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్గా ఉన్న సొనాలి ఘోష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంట్ లా చదివారు. పులులను ట్రాక్ చేసే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్ పొందారు.