News June 14, 2024

TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు

image

AP: టీటీడీ ఈవో ధర్మారెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జె.శ్యామలరావుని నియమించింది. ఈయన ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల ధర్మారెడ్డిని సెలవుపై పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను ధర్మారెడ్డి ఎదుర్కొంటున్నారు.

Similar News

News February 4, 2026

మనలో ధైర్యాన్ని పెంచే ‘మూలాధార చక్రం’

image

వెన్నెముక చివరన ఉండే ఈ చక్రం మన మనుగడకు పునాది. ఇది సమతుల్యంగా ఉంటే ధైర్యం, ఆర్థిక స్థిరత్వం, సురక్షితమైన భావం కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది అస్థిరంగా ఉంటే భయం, అభద్రత, కాళ్ల నొప్పులు వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి రోజూ ‘లం’ అనే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఎరుపు రంగు వస్తువులు వాడటం, నేలపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా భూమితో సంబంధం పెంచుకుంటే ఈ చక్రం శక్తివంతమవుతుంది.

News February 4, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. DSP ప్రణీత్‌రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. DSP నుంచి సీఐగా ప్రణీత్‌రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ తర్వాత సస్పెండయ్యారు. DSPని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

News February 4, 2026

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నం

image

ఒకవైపు చర్చలకు సానుకూలంగా ఉన్నామని చెబుతూనే, తమ యుద్ధనౌకపైకి డ్రోన్ దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధపడిందని అమెరికా ఆరోపించింది. అరేబియా సముద్రంలో ఉన్న ‘అబ్రహం లింకన్’ విమాన వాహక నౌకపైకి.. ఇరాన్‌కు చెందిన ‘షాహెద్ 139’ డ్రోన్ దూసుకొచ్చిందని, దాన్ని F-35 యుద్ధవిమానంతో కూల్చివేశామని అమెరికా అధికారులు తెలిపారు. ఈ వారం చివరిలో USA-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వెలువడ్డాయి.