News October 15, 2024

SMATలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ తొలగింపు

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఈ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను అమలు చేస్తుండగా, 2023 సీజన్ నుంచి ఐపీఎల్‌లోనూ ప్రవేశ పెట్టారు. 2027 వరకూ దీనిని కొనసాగించనున్నట్లు ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ ఈ రూల్‌ను తొలగించాలని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News September 18, 2025

భద్రాచలం: డ్రిల్ బిట్‌ను మింగిన బాలుడు

image

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఎటపాక మండలం చోడవరానికి చెందిన గౌతమ్‌(8) ఆడుకుంటూ డ్రిల్ బిట్‌ను మింగాడు. అది పేగులో ఇరుక్కోవడంతో బాలుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి డ్రిల్ బిట్‌ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.

News September 18, 2025

‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

image

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 18, 2025

మళ్లీ భారత్vsపాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?

image

ఆసియా కప్-2025లో భారత్vsపాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో ఈ ఆదివారం (Sep 21) రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. కాగా గ్రూప్-A నుంచి భారత్, పాక్ సూపర్-4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్-4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడనుంది. అటు గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ సూపర్-4 రేసులో ఉన్నాయి.