News June 5, 2024

సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డుల తొలగింపు

image

ఏపీ సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డులను అధికారులు తొలగించారు. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిలోని సామగ్రి తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా కీలక ఫైళ్లు మిస్ అవుతున్నాయనే ఆరోపణలతో పలు శాఖల అధికారులు ఇప్పటికే సోదాలు చేపట్టారు. ల్యాప్‌టాప్‌లు, డేటాను పరిశీలిస్తున్నారు.

Similar News

News October 6, 2024

INDvPAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

image

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమ్ ఇండియా అమ్మాయిలు నేడు పాకిస్థాన్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్: మునీబా అలీ, గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా, తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్
భారత్: మంధాన, షఫాలీ, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, అరుంధతి, సజన, శ్రేయాంక, శోభన, రేణుక

News October 6, 2024

చంద్రబాబుకు ఇప్పుడు బైబిల్ కావాలి: VSR

image

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో ‘పవిత్ర రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తోంది. పవిత్ర క్రిస్మస్ వస్తుంది‌గా వేషం మార్చాలి. అర్జెంట్‌గా బైబిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్’ అని రాసుకొచ్చారు. బాబువి ఊసరవెల్లి రాజకీయాలు అని ఆయన విమర్శించారు.

News October 6, 2024

ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: <>aptet.apcfss.in<<>>