News April 6, 2024
ముస్లిం మహిళల హిజాబ్ తొలగింపు.. రూ.145కోట్ల పరిహారం!

న్యూయార్క్లో (US) ఇద్దరు ముస్లిం మహిళలకు బలవంతంగా హిజాబ్ తొలిగించి ఫొటో తీసినందుకు అక్కడి యంత్రాంగం రూ.145కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అధికారుల చర్యతో అసౌకర్యానికి గురయ్యామని జమీలా క్లార్క్, అర్వా అజీజ్ 2018లో కేసు వేశారు. తాజాగా న్యూయార్క్ యంత్రాంగం పరిహారం చెల్లించేందుకు ఓకే చెప్పింది. ఈ డబ్బును రూ.6.5లక్షల చొప్పున ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న దాదాపు 4000 మంది మహిళలకు ఇవ్వనున్నారు.
Similar News
News October 29, 2025
అజహరుద్దీన్కు మంత్రి పదవి.. BJP అభ్యంతరం!

TG: అజహరుద్దీన్కు <<18140326>>మంత్రి<<>> పదవి ఖాయమని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చాక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
News October 29, 2025
నియోజకవర్గమంతా ఒకే డివిజన్లో ఉండేలా చర్యలు: మంత్రి అనగాని

AP: గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజనలోని లోపాలను సవరించడంపై క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ చర్చించింది. CM ఆదేశాలు, మంత్రులు ఇచ్చిన సూచనలను పరిశీలించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండల, పంచాయతీలను విభజించకుండా నియోజకవర్గమంతటినీ ఒకే డివిజన్లో ఉంచాలని నిర్ణయించామన్నారు. కాగా కేంద్రం చేపట్టే జనగణనకు ముందే విభజనపై నివేదికను అందిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు.
News October 29, 2025
ఇక స్పామ్ కాల్స్కు చెక్.. TRAI నిర్ణయం!

ఇన్కమింగ్ కాల్స్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కాలర్ పేరు రిసీవర్ ఫోన్లో ఇకపై డిఫాల్ట్గా డిస్ప్లే కానుంది. ఈ మేరకు టెలికం శాఖ ప్రపోజల్కు TRAI ఆమోదం తెలిపింది. SIM తీసుకునేటప్పుడు ఇచ్చిన వివరాలను ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ ఫీచర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది అందుబాటులోకొస్తే TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. స్పామ్ కాల్స్ను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని TRAI చెప్పింది.


