News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్టెల్ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News August 22, 2025
Dream 11పై బ్యాన్.. BCCI ఏమందంటే?

కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11పైనా బ్యాన్ పడనుంది. దీనిపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘అనుమతి లేకపోతే స్పాన్సర్ను తొలగిస్తాం. కేంద్రం తీసుకొచ్చే ఏ పాలసీనైనా తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యే ఆసియా కప్లో స్పాన్సర్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.
News August 22, 2025
లిక్కర్ స్కాం.. సిట్ విచారణలో నారాయణస్వామి ఏమన్నారంటే?

AP: లిక్కర్ స్కాం కేసులో తనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని మాజీ Dy.CM నారాయణస్వామి కోరారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు పుత్తూరులోని ఆయన ఇంట్లో 6గంటల పాటు ప్రశ్నించారు. మద్యం ఆర్డర్స్లో మాన్యువల్ విధానం ఎందుకు తీసుకొచ్చారు? తదితర ప్రశ్నలను సిట్ అడిగినట్లు సమాచారం. మద్యం పాలసీలో మార్పుల గురించి తనకేం తెలియదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా ప్రశ్నలనూ దాటవేసినట్లు సమాచారం.
News August 22, 2025
కరెన్సీ నోట్లపై గాంధీని బాగానే గుర్తుపడతారు: HC

TG: ఇటీవల HYDలో జరిగిన విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని HC జడ్జి జస్టిస్ నగేశ్ ప్రశ్నించారు. స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయామన్న <<17483930>>పిటిషనర్ వాదన<<>>కు.. కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని బాగానే గుర్తుపడతారని చురకలంటించారు. మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు. ఒకరినొకరు నిందించుకోవడం ఆపి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.