News April 14, 2024
ప్రముఖ నిర్మాత కన్నుమూత
కన్నడ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త సౌందర్య జగదీశ్(55) కన్నుమూశారు. ఆర్థిక కష్టాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గుండెపోటు వల్లే మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పు అండ్ పప్పు, మస్త్ మజా మాది(కిచ్చా సుదీప్), రామ్లీలా(చిరంజీవి సర్జా), స్నేహితరు(దర్శన్) తదితర చిత్రాలను ఈయన నిర్మించారు. కాగా నెల కిందటే జగదీశ్ కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది.
Similar News
News October 12, 2024
BIG ALERT: అతి భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.
News October 12, 2024
ఇవాళ పాలపిట్టను ఎందుకు చూడాలంటే?
దసరా రోజున పాలపిట్టను చూస్తే అదృష్టం, విజయం వరిస్తుందని నమ్మకం. రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూడటంతో విజయం సాధించాడని పురాణ గాథ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు పాలపిట్టను చూడటంతో కౌరవులను గెలిచారని మరోగాథ. ఈ నమ్మకంతో గ్రామాల్లో దసరా రోజున సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు, ఊరి చివరకు వెళ్తారు.
News October 12, 2024
జగన్మాతగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.