News April 6, 2024
ఆగస్టు తర్వాతే రెపో రేటులో కోతలు: సిద్ధార్థ సన్యాల్

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో ఆర్బీఐ నిర్ణయాలను బాగున్నాయని ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ కొనియాడారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఆగస్టు తర్వాతే రెపో రేటు (ప్రస్తుత 6.5శాతం) కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4శాతం తగ్గొచ్చని.. దీంతో రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అన్నారు.
Similar News
News December 12, 2025
జియో యూజర్లకు గుడ్న్యూస్

జియో స్టార్తో తమ కాంట్రాక్ట్ కొనసాగుతుందని ICC స్పష్టం చేసింది. క్రికెట్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్ను జియో రద్దు చేసుకోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. రానున్న టీ20 WCతో పాటు ICC ఈవెంట్లన్నింటినీ నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై జియో హాట్స్టార్లో ఫ్రీగా మ్యాచులు చూడలేమనుకున్న యూజర్లకు ఈ ప్రకటన భారీ ఊరట కలిగించింది.
News December 12, 2025
వాజ్పేయితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సత్యకుమార్

AP: అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘వాజ్పేయ్కు-నాకు-కర్నూలుకు ఓ అనుబంధం ఉంది. నేను 1993లోనే ఢిల్లీ వెళ్లడంతో వాజ్పేయ్తో పరిచయమైంది. 2018లో వాజ్పేయ్ కీర్తిశేషులయ్యాక ఆయన అస్థికలను ఢిల్లీ నుంచి తెచ్చి నా చేతుల మీదుగా పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే అవకాశం దక్కింది’ అని తెలిపారు.
News December 12, 2025
మహిళా జర్నలిస్టుతో శశిథరూర్.. వైరలవుతున్న ఫొటోలు

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. థరూర్ భుజంపై ఆమె చేతులు వేసి ఉన్న పోజ్పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. కాగా ఆమె పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ థరూర్ లేదా రంజున్ ఈ విషయంపై స్పందించలేదు.


