News April 6, 2024

ఆగస్టు తర్వాతే రెపో రేటులో కోతలు: సిద్ధార్థ సన్యాల్

image

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో ఆర్బీఐ నిర్ణయాలను బాగున్నాయని ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ కొనియాడారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఆగస్టు తర్వాతే రెపో రేటు (ప్రస్తుత 6.5శాతం) కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4శాతం తగ్గొచ్చని.. దీంతో రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అన్నారు.

Similar News

News December 1, 2025

పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: రేవంత్ రెడ్డి

image

పాలమూరు ప్రాంతం గత వలస పాలకుల ఏలుబడిలో అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు ఎక్కువ మంది MLAలను గెలిపించిన ప్రజల విశ్వాసంతో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల MNK ప్రాజెక్టులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

News December 1, 2025

ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

image

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

News December 1, 2025

పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

image

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.