News April 6, 2024
ఆగస్టు తర్వాతే రెపో రేటులో కోతలు: సిద్ధార్థ సన్యాల్

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో ఆర్బీఐ నిర్ణయాలను బాగున్నాయని ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ కొనియాడారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఆగస్టు తర్వాతే రెపో రేటు (ప్రస్తుత 6.5శాతం) కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4శాతం తగ్గొచ్చని.. దీంతో రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అన్నారు.
Similar News
News December 19, 2025
వీరు బాదం పప్పులు తినకూడదు

బాదం పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. శీతాకాలంలో బాదం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం, శక్తి లభిస్తుందని కూడా అంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు, జీర్ణ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.
News December 19, 2025
వరి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

వరి కోతల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వరి వెన్నులో 80-90 శాతం గింజలు పసుపు రంగుకు మారుతున్నప్పుడు కర్ర పచ్చి మీద పంటను కోయాలి. పంట పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గడంతోపాటు, గింజలపై పగుళ్లు ఏర్పడతాయి. గింజలలో తేమ తగ్గించడానికి 4-5 రోజులు చేనుపైనే ఎండనివ్వాలి. పనలను తిరగదిప్పితే సమానంగా ఎండుతాయి. పంటను ముందుగా కోస్తే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి.
News December 19, 2025
గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా వస్తాయంటే?

GPలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా నిధులు వస్తాయి. కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల ఖాతాల్లో జనాభా ప్రాతిపదికన నిధులు జమచేస్తుంది. ఈ నిధులు GP పేరు మీద ఉన్న జాయింట్ ఖాతాలో జమ అవుతాయి. ఉపాధి హామీ, తాగునీటి పథకాలు, స్కూల్ డెవలప్మెంట్, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. దీంతో పాటు ఇంటి, కుళాయి పన్నులు, మార్కెట్ ఫీజులు, చెరువుల వేలం ద్వారా ఆదాయం వస్తుంది.


